కామారెడ్డి జిల్లాలో వీఆర్ఓ దారుణ హత్య
బీర్కూర్ : కామారెడ్డి జిల్లాలో ఓ వీఆర్ఓ దారుణ హత్యకు గురయ్యాడు. బీర్కూర్ మండల కేంద్రంలోని 7వ వార్డు పాతవాటర్ ట్యాంక్ వద్ద వీఆర్ఓ రాములును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు.
బుధవారం ఉదయం విగతజీవిగా పడి ఉన్న రాములును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్మూర్కు చెందిన రాములు గత ఏడాది కాలంగా బీర్కూర్ వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. బీర్కూర్లో రూము తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజ్భరత్రెడ్డి, ఎమ్మార్వో క్రిష్టనాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీఆర్ఓ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.