ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తారా?

ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తారా? - Sakshi


హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడాన్ని వీహెచ్‌పీ నేతలు కేశవరాజు, సురేందర్‌రెడ్డి ఖండించారు. 52 రోజుల కేసీఆర్ పాలనలో కేవలం ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేయడం దారుణమని అభ్యంతరం వ్యక్తం చేశారు.



తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియాను నియమించడాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ అనే తెలంగాణ బాలికకు కేవలం 25 లక్షలు మాత్రమే ఇచ్చి, సానియా మీర్జాకు మాత్రం కోటి రూపాయలు ఇవ్వడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.



1956 తర్వాత తెలంగాణకు వచ్చిన వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని ప్రభుత్వానికి.. సానియాకు ఇవ్వడానికి కోటి రూపాయలు  ఎక్కడినుంచి వచ్చాయని లక్ష్మణ్ నిలదీశారు. ఆమె ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, బతుకమ్మ ఆడలేదని గుర్తుచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top