చెవిలో పువ్వులతో నిరసన
పెరిగిన జనాభాకు అనుగుణంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన సంఘం బుధవారం వినూత్న నిరసన తెలిపింది.
ఏప్రిల్ 1 ఫూల్స్ డే పురస్కరించుకొని చెవిలో పువ్వులతో సంఘం నేతలు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాంనాయక్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం ఆ ఊసే పట్టించుకోవట్లేదని విమర్శించారు. వెంటనే ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.