టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్: ఏఐసీసీ
న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. మల్లు భట్టివిక్రమార్కను కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలకు కూడా కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ నియమించింది.
హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా మధిర నుంచి భట్టివిక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. కాగా ఢిల్లీ పీసీసీ చీఫ్గా అజయ్ మాకెన్, జమ్మూ కశ్మీర్కు మాజీ మంత్రి గులామ్ అహ్మద్, గుజరాత్కు భారతీసిన్హ్ సోలంకి, మహారాష్ర్టకు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్లను ఏఐసీసీ నియమించింది.