తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు
నర్సాపూర్: తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నా రు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ నుంచి రెడ్డిపల్లి వరకు తొమ్మిదిన్నర కిలో మీటర్ల మేర జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండిన పంటలను పరిశీలించా రు. రెడ్డిపల్లిలో రైతులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ అడ్డగోలుగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించాలంటే తమను సన్నాసులనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ నీ జాగీరు కాదు, నీ అబ్బ సొత్తు అంతకన్నా కాదు. చట్ట ప్రకారం భూములు సేకరించాలంటే మమ్మల్ని తిడతారా’’ అని ప్రశ్నించారు. అవసరమైతే తాము కూడా అదే స్థాయిలో మాట్లాడ గలమని హెచ్చరిం చారు. దళితులకు మూడెకరాలు, ఇం టికో ఉద్యోగం, డబుల్బెడ్ రూం ఇళ్లు హామీలేమ య్యాయని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల పునాదులపైనే తెలంగాణ ఉద్యమం సాగిందని, నీళ్ల సంగతేమో గానీ నిధులు మాత్రం టీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి పోతున్నాయన్నారు.
ఎన్నికలొస్తే అధికారం కాంగ్రెస్దే...
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఉత్తమ్ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షలు ఏక కాలంలో రుణ మాఫీ చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇవ్వడంతోపాటు వారికి అదనంగా మరో గదిని నిర్మించి ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆయన ప్రకటించారు.
తగ్గిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తులు ప్రతి ఏటా తగ్గుతున్నా యని ఉత్తమ్ చెప్పారు. శాసనసభలో స్వయంగా అధికార పక్షమే ఈ విషయం ప్రకటించిందని గుర్తు చేశారు. 2013–14 సంవత్సరంలో రాష్ట్రంలో 107 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తయ్యాయని, ఉత్ప త్తులు ప్రతిసారి తగ్గుతూ వచ్చాయని ఆయన వివరించారు. 2014–15లో 75 లక్షల టన్నులకు పడిపోగా 2015–16లో 51 లక్షల టన్నులకు పడిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తులు తగ్గాయంటే రైతుల ఆదాయం తగ్గినట్లేనని ఆయన చెప్పారు. వ్యవసాయం, రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.