తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: ఉత్తమ్
నేరేడుచర్ల: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలనిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మార్కెట్ యార్డులోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం చెల్లించాలన్నారు.