అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య
మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని ఓ టైలర్ షాపులో ఎన్.మలాలమన్(50) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.