అయ్యో పాపం..


కోతులకు భయపడి పరుగులు.. రెండేళ్ల చిన్నారి మృతి



 ఏన్కూరు: కోతుల గుంపునకు భయపడి పిల్లలు పరుగులు తీసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అరికాయలపాడులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెజవాడ సుధాకర్ రెండో కుమార్తె జస్విక(2) ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఈ చిన్నారికి సమీపంలో వీధిలో మరికొందరు పిల్లలు ఆడుకుంటున్నా రు.



ఈలోగా ఓ కోతులు గుంపు అటువైపు రావడంతో పిల్లలు భయపడి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న జస్వికకు ఓ చిన్నారి బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా కిందపడి కుప్పకూలింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. వెంటనే ఏన్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. జస్విక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top