ఇద్దరి అనుమానాస్పద మృతి
పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆనవాళ్లు
అమడబాకుల చెర్వు సమీపంలో ఘటన
కొత్తకోట : మండలంలోని అమడబాకుల చెర్వు సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు మృతదేహాలు అ నుమానాస్పదంగా పడి ఉండడం సంచలనం సృష్టించింది. పురుగుల మం దు తాగి ఓ జంట ఆత్మహత్య చేసుకున్నట్లుగా అక్కడ ఆనవాళ్లు లభిం చాయి. మంగళవారం సాయంత్రం రెండు మృతదేహాలను చూసిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచా రం అందించారు. కొత్తకోట ఎస్సై కృష్ణ, కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. క్రిమిసంహారక మందు మృతదేహాల దగ్గర లభించింది. ఎస్సై కృష్ణ కథనం ప్రకారం... మృతులు వీపనగండ్ల మండలం వెల్టూరుకు చెందిన వారు అని ప్రాథమికంగా గుర్తించారు.
మృతులు గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే నాగరాజు (30), హోటల్ నడుపుకునే చెన్నమ్మ(25)లవి గుర్తించామని ఎస్సై చెప్పారు. వీరిద్దరూ వివాహితులని, ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు. అయితే వీరిది ఆత్మహత్యగానే తాము భావిస్తున్నామన్నారు. నాగరాజు, చెన్నమ్మలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవడంతోపాటు వీరి మరణానికి కారణాలేమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా ఉదయం పెబ్బేరులో వీరు కలిసి కనిపించారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతదేహాలను వనపర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు చెబుతామని ఎస్సై కృష్ణ విలేకరులకు చెప్పారు.