ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ఇద్దరి మృతి
యాదగిరిగుట్ట(నల్గొండ జిల్లా): యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద జాతీయరహదారిపై సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.