ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి


చిన్నకోడూరు: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మండేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రెండు వేర్వేరు సంఘటనల్లో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. మెదక్ జిల్లా మండేపల్లి గ్రామానికి చెందిన బి. లక్ష్మయ్య(60) అనే వ్యక్తి  నాలుగు నెలల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మనస్థాపంతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.



కాగా అదే గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(45) అనే మహిళ కూడా శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. లక్ష్మమ్మ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top