నకిలీ నోట్లు చలామణి... ఇద్దరు అరెస్టు
రంగారెడ్డి: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన సాకేత్వాలా రమేష్, మహ్మద్ రియాజ్లు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారనే సమచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వారిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ, 6.20 లక్షల విలువైన నకిలీ రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే ముఠాకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.
సంబంధిత వార్తలు