కారును ఢీ కొన్న బైక్ : ఇద్దరు మృతి


ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఛత్తీస్‌గఢ్ వాసులు మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం - తూరుపాక రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని గొల్లపల్లికి చెందిన పొడియం సింగరయ్య కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం అతను వస్తున్నాడని తెలియడంతో అతన్ని తీసుకురావడానికి స్నేహితులు సింగరయ్య(53), ముఖేష్(28)తో కలిసి ఖమ్మం చేరుకున్నాడు.


ఈ రోజు మధ్యాహ్నం సింగరయ్య కొడుకు లక్ష్మయ్య(27)తో కలిసి ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనం పై తిరుగు ప్రయణమయ్యారు. ఈ క్రమంలో బైక్ నరసాపురం - తూరుపాక మధ్యలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న ముఖేష్ అక్కడికక్కడే మృతిచెందగా.. లక్ష్మయ్య, సింగరయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగరయ్య కొద్దిసేపటికే మరణించాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top