భువనగిరిలో రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి


నల్గొండ : నల్గొండ జిల్లా భువనగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం భువనగిరి బైపాస్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఇండికా కారులో వరంగల్‌ నుంచి హైదరాబాద్కు వస్తుండగా.... ముందున్న కారును ఓవర్‌ టేక్‌ చేయబోయి ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు పోలీస్‌ కానిస్టేబుల్‌, మరొకరు కారు డ్రైవర్‌. వీరంతా వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top