తీజ్‌ వేడుకల్లో అపశృతి


నల్లగొండ: తీజ్‌ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరుడుగోమ్ము మండలం పడమటితండాలో గురువారం వెలుగుచూసింది.

 

తండాలో తీజ్‌ పండుగ జరుపుకుటున్న సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top