విద్యుత్ షాక్తో ఇద్దరు రైతుల మృతి
కొత్తగూడెంరూరల్(ఖమ్మం): పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు కరెంటు షాక్ తగిలి మృతి చెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంనగర్ పంచాయతీ పరిధిలోని మంగపేట గ్రామానికి చెందిన రైతులు భూక్యా చందర్(32), భూక్యా స్వాములు(42) గురువారం సాయంత్రం చెరువు ఆయకట్టులోని పొలం వద్దకు వెళ్లారు.
చెరువు గట్టుపై ఉన్న మోటారు స్టార్ట్ అయ్యేందుకు ముందుగా నీళ్లు పోయాల్సి ఉంది. నీటి కోసం చెరువులో దిగిన చందర్..చేపల పెంపకందారులు చేపల దొంగలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు వైరును తాకటంతో షాక్కు గురయ్యాడు. అతడు గట్టిగా కేకలు వేయటంతో స్వాములు రక్షించబోగా అతడికి కూడా షాక్ వచ్చింది. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.