హోటల్లోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి
మహబూబ్ నగర్: కొడంగల్ మండలం కస్తూరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మహారష్ట్ర వెళ్లున్న లారీ అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో మూడేళ్ల చిన్నారితోపాటూ ఓ వృద్ధురాలు ఉన్నారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో కొడంగల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.