రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
మహబూబ్నగర్ : వేగంగా వస్తున్న జీపు- బైక్ ఢీకొనడంతో బైక్పై ఉన్న తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లి క్రాస్రోడ్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... ఉప్పునూతల మండలం పెనిమిళ్ల గ్రామానికి చెందిన బోడ మల్లయ్య(48), బోడ బాలనారి(23) తండ్రీ కొడుకులు. మంగళవారం వారిద్దరూ అమ్రాబాద్ నుంచి అచ్చంపేట వైపు బైక్పై వెళ్తున్నారు. కాగా ఎల్మపల్లి క్రాస్రోడ్డు వద్ద వేగంగా వస్తున్న జీపు బైక్ను ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.