రెండు బైకులు ఢీ: ఒకరి దుర్మరణం
మొయినాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై మండల పరిధిలోని చిన్నషాపూర్ గేటు వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అప్పారెడ్డిగూడకు చెందిన కురవ శ్రీను(21) శనివారం బైక్పై హైదరాబాద్ నగరానికి వెళ్లాడు.
తిరిగి రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై చిన్నషాపూర్ గేటు వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న ఎస్సై రవీంద్రనాయక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.