ప్రభుత్వ స్కూళ్ల మూసివేతపై నిరసన


హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి(టీవీపీఎస్) ఆందోళనకు దిగింది. టీవీపీఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట పలువురు సభ్యులు ధర్నాకు దిగారు. పభుత్వ స్కూళ్లను ప్రభుత్వం పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ప్రభుత్వం స్కూళ్ల రేషనలైజేషన్ విషయంలో మెండిగా ముందుకు వెళితే ఆందోళన ఉధృతం చేస్తామని టీవీపీఎస్ తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top