తెలంగాణ స్త్రీశక్తి పురస్కారాలు


హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ స్త్రీ శక్తి ’ పురస్కారాలు ఇవ్వనున్నారు. టీఆర్‌ఎస్ మహిళా విభాగం తరఫున ఈ పురస్కారాలను అందించాలని నిర్ణయించినట్లు  ఆ విభాగం రాష్ట్ర కన్వినర్, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ప్రకటించారు. పోరాటయోధులతోపాటు క్రీడా, సాహితీ, రచనా, రాజకీయం వంటి పలు రంగాల్లో రాణించిన మహిళలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మార్చి 8వ తేదీన తెలంగాణ భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top