మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్సే టాప్
నల్లగొండ: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఈ కౌంటింగ్ లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేతగా నిలవాలంటే ఏ పార్టీకైనా 66,777 ఓట్లు రావాలి. కానీ టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థికి 59,764, బీజేపీ అభ్యర్థికి 47,041 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి 11,323 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.