టీఆర్ఎస్ ప్లీనరీపై దృష్టి సారించిన కేసీఆర్

టీఆర్ఎస్ ప్లీనరీపై దృష్టి సారించిన కేసీఆర్ - Sakshi


హైదరాబాద్:  ఈ నెల 24న ఎల్ బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశాన్ని విజయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. పార్టీ, ప్రభుత్వంలో మార్పులపై ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.


ఈ నెల 27న పరేడ్ గ్రౌండ్స్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఫలితాలపై కేసీఆర్ ఈ సందర్బంగా పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top