'కాంగ్రెస్లోకి టీఆర్ఎస్ వలసలు ఖాయం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల తరువాత టీఆర్ఎస్ పార్టీ నేతలే కాంగ్రెస్లోకి వస్తారని ఆ పార్టీ నాయకుడు షబ్బీర్అలీ వ్యాఖ్యానించారు. వైద్యశాఖలో జరిగిన స్కాంల వివరాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తానన్న రాజయ్యను బర్తరఫ్ చేయడానికి గల కారణాలేంటో చెప్పాలన్నారు. బర్తరఫ్ చేశారంటే భారీగా అవినీతి జరిగి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలను చేస్తున్నారని షబ్బీర్ మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన టోల్ఫ్రీ నెంబర్లకు వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. వచ్చిన అవినీతి ఆరోపణలలో ఎక్కువగా సీఎం కార్యాలయం, మంత్రులు, అధికారులపైనే ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. అయ్యప్ప సొసైటీ ఆక్రమణల తొలగింపు పనులను మధ్యలో ఎందుకు ఆపేశారో సీఎం సమాధానం చెప్పాలని.. వీటన్నింటి పైనా విచారణ జరిపించాలని షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు