ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీఆర్ఎస్
బీక్యతండ(మోతె) :ఏడు నెలల పాలనలో ప్రజాసమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గురువారం మండల పరిధిలోని బీక్య తండలో కీలుకాని సోమయ్య జ్ఞాపకార్థం ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్తో పాటు సీపీఎం కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బొడుపుల పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఎంతోమంది తమ ప్రాణాలను తృణపాయంగా వదిలేశారని, వారి కుటంబాలను టీఆర్ఎస్ ప్రభత్వుం పరామర్శించలేదన్నారు.
వారి కుటుంబాలని సీపీఎం పరామర్శించిందన్నారు. రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ, ప్రజలకు అండగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది కమ్యూనిస్టు పార్టీలే అని పేర్కొన్నారు.తండాల్లో గిరిజనులకు అండగా ఉండి తాగు నీటి సౌకర్యం కల్పించిన కీలుకాని లక్ష్మణ్,వెంకన్న,పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన గోదానాయక్ కుమారులు బాబునాయక్, బాబులను అభినందించారు.అనంతరం కీలుకాని నగర్లో కీలుకాని సోమయ్యస్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కోదాడ డివిజన్ కార్యదర్శి జుట్టుకొండ బసవయ్య, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.