క్యాడర్‌కు అండగా నిలబడతాం: పొన్నాల

క్యాడర్‌కు అండగా నిలబడతాం: పొన్నాల - Sakshi


హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అట్రాసిటీ పేరుతో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను రద్దుచేస్తున్నారని అన్నారు.



క్యాడర్‌కు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని దీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేక అంశాలపై ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై నిజామాబాద్ జిల్లా నాయకులతో గాంధీభవన్ లో పొన్నాల సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top