టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కందిరీగల దాడి

టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కందిరీగల దాడి - Sakshi


తప్పించుకున్న హరీశ్‌రావు



తూప్రాన్ : కందిరీగల దాడి నుంచి మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డిలు తప్పించుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రమాయిపల్లి వద్ద ఓ ప్రైవేట్ అతిథి గృహంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.



కొందరు కార్యకర్తలు పక్క మామిడితోటలో కాయలు కోయగా.. అక్కడున్న కందిరీగలు చెదిరి సమావేశ మందిరంలోకి చొరబడ్డాయి. విషయం తెలుసుకున్న మంత్రి, ఎంపీలు కారెక్కి వెళ్లిపోయారు. కందిరీగల దాడిలో పలువురు గాయపడ్డారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top