గుజ్జుల్ తండాలో కలకలం
గాంధారి: నిజామాబాద్ జిల్లా గాంధారి మండలంలోని ఓ తండాలో కలకలం రేగింది. తండా వాసులు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని పెద్ద గుజ్జుల తండాలో సుమారు వంద మంది గిరిజనులు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. వీరందరూ మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.