ఔటర్‌పై నిలిచిన ట్రావెల్స్ బస్సు


మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా): మరో ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను నానా యాతనకు గురిచేసింది. హైదరాబాద్ నుంచి 45 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి చెన్నైకు బయల్దేరిన కేశినేని ట్రావెల్స్ బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై నిలిచిపోయింది. ఏసీలో సమస్య తలెత్తడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి మెకానిక్‌కు కబురు పెట్టాడు. సమస్య సరిచేసిన తర్వాత బస్సు బయల్దేరుతుందని సమాచారం. అయితే, 8.45 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకూ ప్రయాణికులు ఔటర్‌పై పడిగాపులు కాయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top