కాజీపేట్-మంచిర్యాల మార్గంలో రైళ్లకు అంతరాయం


కాజీపేట్-మంచిర్యాల మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. కనీసం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. రామగుండం రైల్వే ప్లై ఓవర్ వద్ద గడ్డర్ల పనులు చేపట్టడంతో ఈ ఆలస్యం జరగనుంది. ఈ పనుల కారణంగా రాఘవపూర్-పెద్దం పేట రైల్వే లైన్కు పవర్ సప్లై నిలిపివేశారు. దీంతో ఈ పనులు పూర్తయ్యే వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top