ట్రైనీ కానిస్టేబుళ్లకు అస్వస్థత

ట్రైనీ కానిస్టేబుళ్లకు అస్వస్థత - Sakshi


అదిలాబాద్‌: కలుషితాహారం తిని 32 మంది ట్రైనీ కాసిస్టేబుళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అదిలాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని డీటీసీ సెంటర్‌లో ట్రైనింగ్‌ అవుతున్న కానిస్టేబుళ్లు రాత్రి తిన్న ఆహారం కలుషితమవడంతో.. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలయ్యారు.



దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు వారిని హుటాహుటిన రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి తిన్న చికెన్‌ వికటించడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top