మఫ్టీలో ట్రాఫిక్ కానిస్టేబుల్..


నల్లకుంట (హైదరాబాద్) : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని నల్లకుంట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.సందీప్ రెడ్డి వాహనదారులను హెచ్చరించారు. గురువారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తాలో 'కాప్‌ లెస్ జంక్షన్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఎవరూ ఉండరని, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం మఫ్టీలో ఉంటాడని చెప్పారు.



మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారుల సమాచారాన్ని కొద్ది దూరంలో విధులను నిర్వహించే పోలీసు అధికారులకు వైర్‌లెస్ సెట్‌ ద్వారా సమాచారమందిస్తాడని చెప్పారు. ఆ సమాచారంతో వాహనదారుడుని పట్టుకుని జరిమానా విధిస్తామని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top