రేపు జగన్ పుట్టిన రోజు వేడుకలు

రేపు జగన్ పుట్టిన రోజు వేడుకలు - Sakshi


వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈ నెల 21న ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్యనాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.



జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, సయ్యద్ ఖాదర్, నాగపురి దయాకర్, నాగవెల్లి రజనీకాంత్, ముజఫరుద్ధీన్‌ఖాన్, జీడికంటి శివ తదితరులు పాల్గొన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top