నీటితొట్టిలో పడి బాలుడు మృతి


డోర్నకల్: నీటి తొట్టిలోపడి బాలుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన మౌలి-యాకూబీ దంపతుల కుమారుడు హబీబ్(18 నెలలు) గురువారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీటి తొట్టిలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి బయటకు తీసేసరికి బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.


వెంటనే చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హబీబ్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top