నేడు యాదాద్రి బంద్‌..


యాదాద్రి: ఆటో డ్రైవర్లకు మద్దతుగా యాదాద్రి బంద్‌ కొనసాగుతుంది. యాదగిరి గుట్టపైకి ఆర్టీసీ బస్సులు నడపవద్దని రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్లు రాస్తారోక జరిపారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు కూడా. ఈ సందర్భంగా పోలీసులు ఆటో కార్మికులను చెదరగొట్టి వారిపై కేసులు నమోదు చేశారు.

 

ఈ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటో డ్రైవర్లు యాదగిరి గుట్ట బంద్‌కు పిలుపునిచ్చారు. దుకాణదారులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top