ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. కొత్త పారిశ్రామిక విధానం, పరిశ్రమలకు రాయితీలు కల్పించే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల రక్షణ, భద్రతపై కొత్త చట్టం ముసాయిదా బిల్లును కేబినెట్ ముద్ర వేసింది.
కొత్త ఇసుక పాలసీపై తెలంగాణ కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం ఆమోదించిన బిల్లులను తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.