నేడు అసెంబ్లీ, మండలిలో ద్రవ్యవినిమయ బిల్లు


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో సవరణల ద్వారా ఓటింగ్కు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీడీపీలు భావిస్తున్నాయి. అందుకోసం ఇప్పటికే ఆ పార్టీలు విప్ జారీ చేశాయి. అలాగే కాగ్ నివేదికను కూడా ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఉదయం 9 గంటలకే అసెంబ్లీకి చేరుకోవాలని అధికారపక్షం సభ్యులను ఆదేశించింది. రేపటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top