అర్హులైన వారినే ఎంపిక చేస్తాం


జన్నారం: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బస్తీ పథకం కింద అర్హులైన వారినే ఎంపిక చేస్తామని  తహశీల్దార్‌ సత్యనారాయణ పెర్కోన్నారు. అందుకే మొదటి విడతగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం మండలంలోని ధర్మారంలో గ్రామ సభ నిర్వహించి దళితుల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం నుంచి 40 ధరఖాస్తులు వచ్చాయని, అందులో నలుగురిని ఎంపిక చేశామని చెప్పారు.  ఎంపికలో ఎలాంటి అక్రమాలు జరిగే ప్రసక్తి లేకుండా అందరి సమక్షంలోనే ఎంఫిక చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ ప్రణవ్‌కుమార్, మార్కేట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సతీశ్‌కుమార్‌, ఆర్‌ఐ సంతోశ్, టీఆర్‌ఎస్‌ నాయకులు సత్యం, ఎమ్మార్పీఎస్‌ నాయకులు రాజరాం తదితరులు పాల్గోన్నారు.













 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top