పిడుగుపడి వీఆర్‌ఏ మృతి


పిడుగుపాటుకు గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ) ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వీఆర్‌ఏ కొలుకుల నర్సింహులు ఇంటి దగ్గర పశువులకు మేత వేస్తుండగా సమీపంలోనే పిడుగు పడింది. దీంతో నర్సింహులతో పాటు ఓ దుక్కిటెద్దు మృతి చెందింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top