ముగ్గురు మంత్రులకు కేసీఆర్ మందలింపు!


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రులను కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ తన పట్టును విడవడం లేదు. టీఆర్‌ఎస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేబినెట్‌లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులను సీఎం ఒకింత తీవ్రంగానే మందలించినట్లు తెలుస్తోంది.



ఆ మంత్రుల శాఖల్లో చోటు చేసుకుంటున్న వ్యవహారాలు... ప్రధానంగా బదిలీలు, కాంట్రాక్టులకు సంబంధించి  ఆరోపణలు రావడంతో ఆయన వీరిని మందలించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేసే ఏ పథకమైనా పార్టీ విధానంలో భాగమని,  వాటిని తమ పథకాలుగా మంత్రులెవరూ ఆపాదించుకోవద్దని కూడా సీఎం సున్నితంగానే సూచించినట్లు తె లి సింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి ‘ కేజీ టు పీజీ’ ఆలోచన తనదేనని పేర్కొనడం సీఎం దృష్టికి వెళ్లిందని, ఈ నేపథ్యంలో పై విధంగా స్పందించారని సమాచారం.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top