ఒకే కుటుంబంలో ముగ్గురి మరణం


కరీంనగర్: అప్పుల బాధ తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా అతని తండ్రి, అమ్మమ్మ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాజు అప్పుల బాధ భరించలేక శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రాజు మృతితో అతని తండ్రి, రాజు అమ్మమ్మ ఆదివారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top