బస్సు- వ్యాన్ ఢీ.. ముగ్గురి మృతి

బస్సు- వ్యాన్ ఢీ.. ముగ్గురి మృతి - Sakshi


ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం గోవర్దనగిరి బస్టాండ్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న వరంగల్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది.



దీంతో వ్యానులో ఉన్న ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి త రలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వారిలో ఒకరు వరంగల్ మట్టెవాడకు చెందిన గోవర్ధన్ కాగా.. మరో ఇద్దరు మహిళల వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top