ఆటోను ఢీకొన్న లారీ: ముగ్గురు మృతి
మెదక్ : మెదక్ జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.