లారీ బోల్తా: ముగ్గురు మృతి


నల్గొండ: నల్గొండ జిల్లా మునగాల సమీపంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై గత రాత్రి లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్నవాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్ తరలించారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఆ ఘటనలో మృతి చెందిన ముగ్గురు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం నల్గొండలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీలో ప్రయాణిస్తున్నవారంతా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగుడెం వాసులను పోలీసులు తెలిపారు. మృతులంతా కూలీలేనని పోలీసులు చెప్పారు. లారీ విజయవాడ నుంచి సిద్ధిపేట వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top