కారు ఢీకొని ముగ్గురి మృతి
నల్లగొండ: అతివేగంగా వచ్చిన స్కోడా కారు స్కూటర్ పై వెళ్తున్న ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట శివారులో దండుమైలారం క్రాసు వద్ద ఆదివారం ఉదయం జరిగింది. స్కోడా కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో స్కూటర్ పై ఉన్న ముగ్గురు గాల్లో ఎగిరి దూరంగా పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బాట సింగారం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.