ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం... ముగ్గురి మృతి


హైదరాబాద్ : నగర శివారు ప్రాంతం నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ ను వేగంగా వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మృతులు భారతి(50), విశ్వనాథ్(28), దీపిక(23)గా పోలీసులు గుర్తించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top