దొంగల బీభత్సం
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. హన్మకొండ మండలం కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని విష్ణుపూరి వీధిలో సోమవారం రాత్రి నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచరాణ చేపడుతున్నారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదు చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సంబంధిత వార్తలు