అప్పుల బాధ తాళలేక.


సిరిసిల్ల: అప్పుల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిరిసిల్లలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న బిజిలి మల్లేశం(45) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

 

ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక గురువారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top