23 నుంచి పుష్కరాల పనులపై మంత్రి సమీక్ష
హైదరాబాద్: ప్రభుత్వం కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ఘనంగా చెప్పుకొంటున్న గోదావరి పుష్కరాలకు గడువు దగ్గరపడుతున్నా ఇంకా ఎక్కడి పనులక్కడే ఉన్నాయి. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు ఆదరాబాదరాగా పనులు నిర్వహిస్తుండటంతో నాణ్యత గల్లంతవుతోంది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని గమనించిన దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పరిస్థితిని సమీక్షించేందుకు స్వయంగా ఆయా క్షేత్రాలు, ఘాట్లను సందర్శించాలని నిర్ణయించారు.
పనులు జరుగుతున్న తీరును పరిశీలించి వాటిని వేగిరం చేయటంతోపాటు నాణ్యత విషయంలో అధికారులకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈనెల 23న భద్రాచలంలో పర్యటించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 24న వరంగల్ జిల్లా ఏటూరు నాగారం పుష్కరఘాట్ను, అనంతరం కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ధర్మపురి ఘాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు.