పీటల మీద పెళ్లి ఆగిపోయింది!


గణపురం: పెళ్లికి సిద్ధమైన వరుడి గుట్టు బయటపడడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వేరొక మహిళతో ఉన్న సంబంధాన్ని దాచిపెట్టి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో శనివారం జరిగింది.



రాంప్రసాద్‌ గౌడ్‌ అనే వ‍్యక్తి ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి చెల్పూరులో ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. విషయం ఎలాగో బయటకు పొక్కడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top